విజేతలకు బహుమతుల ప్రదానం
కాగజ్నగర్ రూరల్: మండలంలోని భట్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల బామని చేనులో వారంరోజులుగా నిర్వహిస్తున్న ట్రై విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో గెలు పొందిన జట్లకు శనివారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా క్రీడా పోటీల్లో పాల్గొని రాణించాలని సూచించారు. విన్నర్గా నిలిచిన అందవెల్లి, రన్నర్గా నిలిచిన భట్పల్లి జట్లకు బహుమతులు అందజేశారు. కార్య క్రమంలో నాయకులు పిర్సింగుల తిరుపతి, శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.


