
నాన్న ప్రోత్సాహంతోనే
పెంచికల్పేట్: మాది పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న దుర్గం లక్ష్మి, తులసీరాం వ్యవసాయం చేస్తూ ఉన్నత చదువులు చదివించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2010లో పదో తరగతి, బాసరలోని ట్రిపుల్ ఐటీలో 2 016లో బీటెక్ పూర్తిచేశాను. నాన్న ఇచ్చిన పోత్సాహంతో యూపీఎస్సీ పరీక్ష రాశాను. బెంగుళూరులోని మినిస్టరీ ఆఫ్ డిఫెన్సులో అడిటర్గా ఉద్యోగం సాధించాను. నా వెంటే ఉంటూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన నాన్నకు ఈ విజయం సొంతం.
– దుర్గం సాయికుమార్, అడిటర్ మినిస్టరీ ఆఫ్ డిఫెన్స్