వీడేనా..? | - | Sakshi
Sakshi News home page

వీడేనా..?

May 26 2025 9:56 AM | Updated on May 26 2025 9:58 AM

అటవీ చిక్కులు

లింగాపూర్‌ మండలం జాములధార గ్రామం నుంచి పంగిడిమాదార గ్రామం వరకు 10 కి.మీ.ల రోడ్డు ఉంది. గతంలో ఈ రోడ్డు బీటీతో వేశారు. కానీ ఇసుక వాహనాల రాకపోకలతో మట్టిరోడ్డులా మారింది. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీ అనుమతులు లేక నిర్మాణానికి నోచుకోలేదు. ఆ రోడ్డు పూర్తయితే రెండు మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. మధ్యలో ఉన్న సుమారు 20 అనుబంధ గ్రామాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుతాయి.

ది తిర్యాణి మండలంలోని లొద్దిగూడ, కౌటాగాం, గీసిగూడ, కేరిగూడ, తాటిగూడ గ్రామాలకు వెళ్లే రహదారి. ఐదళ్ల క్రితం బీటీరోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. కానీ అటవీ అనుమతులు అడ్డుగా మారడంతో పనులు ముందుకు సాగలేదు. నిధులు మంజూరు కావడంతో అధికారులు సర్వే సైతం నిర్వహించారు. అనుమతులు లేక ప్రారంభానికి నోచుకోలేదు. వర్షాకాలంలో వాహనాల రాకపోకలు అటుంచితే కనీసం కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా మారుతుంది.

వాంకిడి(ఆసిఫాబాద్‌): ‘పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల పరిధిలో చేపట్టే రహదారుల పనులకు అటవీ శాఖ అధికారులు సహకరించాలి. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో అనుమతులు జారీ చేయాలి. అవసరమైతే అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో పనులు జరిగేలా చూడాలి..’ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీశాఖ అనుమతులపై ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలివి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రగతికి అటవీ అనుమతులు అడ్డంకిగా మారిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రుల సమావేశంతో స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

అనుమతులు లేక అర్ధంతరంగా నిలిచిన రోడ్ల నిర్మాణాలు

ఏళ్లు గడుస్తున్నా తొలగని అడ్డంకులు

ప్రగతికి దూరంగా మారుమూల గ్రామాలు

మంత్రుల సమీక్షతో చిగురిస్తున్న ఆశలు

వాంకిడి మండలం సర్కేపల్లి గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఐదేళ్ల క్రితం రూ.7కోట్లు మంజూరు చేసింది. ఖమాన గ్రామం నుంచి సర్కేపల్లి వరకు 9 కిలోమీటర్ల దారి నిర్మించాల్సి ఉండగా అటవీ అనుమతులు అడ్డురావడంతో 6 కి.మీ.లు మాత్రమే పనులు పూర్తి చేశారు. ఖమాన నుంచి మారెపల్లి వరకు పూర్తి కాగా.. అక్కడి నుంచి సర్కేపల్లి వరకు పనులు నిలిచిపోయాయి. మూడు కిలోమీటర్ల మేర మూడు ఒర్రెలు ఉండగా ఏటా భారీ వర్షాల సమయంలో అటు వైపు గ్రామాలకు సంబంధాలు తెగిపోతున్నాయి. రోడ్డంతా బురదమయంగా మారి అత్యవసర సమయంలో గ్రామస్తులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు.

వీడేనా..?1
1/2

వీడేనా..?

వీడేనా..?2
2/2

వీడేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement