పేదలపై వడ్డీ మోత | - | Sakshi
Sakshi News home page

పేదలపై వడ్డీ మోత

May 7 2025 12:09 AM | Updated on May 7 2025 12:09 AM

పేదలప

పేదలపై వడ్డీ మోత

● ఆస్తులు తనఖా పెట్టుకుని అప్పులు ● అక్రమంగా అధిక వడ్డీ వసూలు ● ఇటీవల ఆసిఫాబాద్‌లో పలువురు వ్యాపారుల ఇళ్లలో సోదాలు

వాంకిడి(ఆసిఫాబాద్‌): సామాన్య ప్రజలే లక్ష్యంగా జిల్లాలో కొందరు వ్యాపారులు అక్రమంగా వడ్డీ వ్యాపారం సాగిస్తున్నారు. చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే పేద, అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఆస్తులు తనఖా పెట్టుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. రోజూ గడవడమే కష్టంగా ఉన్న నిరుపేదలు అరకొరగా ఉన్న ఆస్తులను కష్టాకాలంలో వ్యాపారుల చేతుల్లో పెట్టేస్తున్నారు. తీసుకున్న అసలుకు సరిసమానంగా వడ్డీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. పట్టణ, మండల కేంద్రాల్లో బడా వ్యాపారులు వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత నెల 29న జిల్లా పోలీస్‌ యంత్రాంగం పలువురు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

రైతులే అధికం..

వడ్డీ వ్యాపారానికి పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు చిన్న, సన్నకారు రైతులే అధికంగా బలవుతున్నారు. ఏప్రిల్‌ నుంచే వ్యవసాయ క్షేత్రాల్లో వేసవి దుక్కులతో పనులు ప్రారంభమవుతాయి. రైతులు భూస్వాములు, వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. మండల కేంద్రాల్లోని ఎరువులు, విత్తన దుకాణ దా రులతోపాటు, ప్రైవేటు పత్తి కాంటా యాజమానులు రైతుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నా రు. అవసరాలకు అప్పులు ఇస్తూ పంట దిగుబడి అనంతరం ముక్కు పిండి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టితో కలిగే నష్టాలతో బ్యాంకు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్‌ వారిని ఆశ్రయించాల్సి వస్తోంది.

ఏకకాలంలో దాడులు

ఆసిఫాబాద్‌ పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇళ్లలో ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఏఎస్పీ చిత్తరంజన్‌ ఆధ్వర్యంలో ఇటీవల ఏకకాలంలో దాడులు నిర్వహించడం కలకలం రేపింది. ముందస్తు సమాచా రంతో ఆసిఫాబాద్‌ సబ్‌ డివిజన్‌లో నలుగురు సీఐ లు, ఎనిమిది మంది ఎస్సైలు, మొత్తం 50 మంది పోలీస్‌ సిబ్బందిలో ప్రత్యేక ప్రణాళికతో సోదాలు ని ర్వహించారు. రూ.11 లక్షల నగదుతోపాటు బ్లాంక్‌ బ్యాంక్‌ చెక్కులు, రాయించుకున్న బాండ్‌ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు సీజ్‌ చేశారు. ఆకస్మికంగా చేపట్టిన ఈ సోదాలతో జిల్లాలోని వడ్డీ వ్యాపారుల్లో కలవరం మొదలైంది. పట్టణ ప్రాంతాలతోపాటు మండలస్థాయి, గ్రామీణ ప్రాంతాల్లోనూ చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారాలపై నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.

అనుమతి లేకుంటే చర్యలు

అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. సామాన్యులతో పాటు అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదు. ఇటీవల 15 మంది ఇళ్లలో సోదాలు నిర్వహించి పదిమందిపై కేసులు నమోదు చేశాం. బాధితుల ఫిర్యాదు చేస్తే దాడులు నిర్వహిస్తాం.

– చిత్తరంజన్‌, ఏఎస్పీ

అధిక వడ్డీలకు అప్పులు..

జిల్లాలో వందకు రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ విధిస్తున్నారు. సామాన్యులు రుణాల కో సం బ్యాంకులకు వెళ్తే డాక్యుమెంట్లు, ఇతర ధ్రు వపత్రాల పేరుతో ఖాతాల్లో డబ్బులు జమ కా వాలంటే సమయం పడుతుంది. అన్నీ తెలిసిన వ్యక్తులు మాత్రమే బ్యాంకు రుణాలు పొందగలుగుతున్నారు. తొందరగా రుణాలు పొందాల నే పేదలు వడ్డీ వ్యాపారుల వద్ద బాండ్లు రాసి, లేదా ఆస్తులు తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. దీంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. గతంలో పట్టణాల్లోనే ఉన్న వడ్డీ వ్యాపారం వ్యవస్థ క్రమంగా గ్రామాలకూ పాకింది. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉండే భూస్వాములు, దుకాణదారులు ఈ దందాపై కన్నేశారు. పేదల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. అధిక వడ్డీలు భారంగా మారుతుండటంతో అసలు చెల్లించలేకపోతున్నారు. ఏటా వడ్డీ కడుతూ అప్పుల్లో మునిగిపోతున్నారు. అప్పులు తీర్చలేకపోతే ముందుగానే రాయించుకున్న ఆస్తులు జప్తు చేసుకుంటున్నారు. బంగారం, భూములు తదితరాలు అత్యవసర సమయాల్లో కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా బాధితులు అప్పు తీసుకోవడమే తప్పుగా భావిస్తూ ఫిర్యాదులకు ముందుకు రావడంలేదు.

పేదలపై వడ్డీ మోత1
1/1

పేదలపై వడ్డీ మోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement