
త్వరలో నియామకాలు, జీతాల పెంపు
రెబ్బెన(ఆసిఫాబాద్): త్వరలో గ్రంథాలయాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు నియామకాలు చేపట్టడంతోపాటు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎండీ రియాజ్ తెలిపారు. మండల కేంద్రంలోని గ్రంథాలయాన్ని మంగళవా రం తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న పుస్తకా లు, రోజువారీగా వస్తున్న పాఠకుల సంఖ్య, గ్రంథా లయంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందన్నా రు. పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యార్థులు, యువత లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తప్పనిసరిగా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు.
పాత స్టేషన్లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి
మండల కేంద్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పాత పోలీస్ స్టేషన్ భవనంలో తాత్కాలికంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠకులు, విద్యార్థులు రాష్ట్ర చైర్మన్కు వినతిపత్రం అందించారు. ప్రస్తుతం గ్రంథాలయం కొనసాగుతున్న భవనం ఇరుకుగా ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. స్పందించిన ఆయన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లావుడ్య రమేశ్, నాయకులు మోడెం సుదర్శన్గౌడ్, మడ్డి శ్రీనివాస్గౌడ్, దుర్గం రాజేష్, దుర్గం అన్నాజీ, జహీర్బాబా, నాసిర్ ఉస్మానీ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
కౌటాల/సిర్పూర్(టి): జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అన్నారు. కౌటాల, సిర్పూర్(టి) మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను మంగళవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని గ్రంథాలయాలు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. కౌటాల, సిర్పూర్(టి) లైబ్రరీలకు నూతన భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.
రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఎండీ రియాజ్