తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలి

May 7 2025 12:09 AM | Updated on May 7 2025 12:09 AM

తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలి

తాగునీటి సమస్యలపై తక్షణమే స్పందించాలి

● కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే

ఆసిఫాబాద్‌అర్బన్‌: వేసవిలో ఉత్పన్నమయ్యే తాగునీటి సమస్యలపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం మిషన్‌ భగీరథ పథకం ఇంజినీర్లు, జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో తాగునీటి సరఫరాపై సమీ క్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ తాగునీటి సమస్యలపై దినపత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై స్పందించి వెంట నే పరిష్కరించాలన్నారు. ప్రతీ మండలంలో బుధవారం తాగునీటి సమస్యలపై ఎంపీడీవో కార్యాలయాల్లో సమీక్షించాలని ఆదేశించారు. జిల్లాలోని 147 హ్యాబిటేషన్‌ గ్రామాల్లో ప్రత్యామ్నాయంగా నీటి ట్యాంకర్లు, బోర్‌వెల్స్‌ ద్వారా నీటిని అందించా లన్నారు. మిషన్‌ భగీరథ పైపులైన్లలో లీకేజీలకు యుద్ధప్రతిపాదికన మరమ్మతులు చేపట్టాలని సూ చించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి వృథా పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పంచా యతీ కార్యదర్శులు ప్రతిరోజూ తాగునీటి వివరాల ను అందించాలని ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీ ప్రత్యేకాధికారులు తాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్‌, డీఆర్‌డీవో దత్తారావు, డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌, డీఎల్‌పీవో ఉమర్‌ హు స్సేన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ భుజంగ్‌రావు, మిషన్‌ భగీరథ ఈఈ సద్దిఖి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల జాబితాలపై హౌసింగ్‌ కార్పొరేషన్‌ పీడీ, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పైలట్‌ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బేస్‌మెంట్‌ వరకు పూర్తిచేసిన లబ్ధిదారులకు మొదటి విడత నిధులు అందించాలని ఆదేశించారు. ఇళ్లను 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకోవాలని, సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు. హౌసింగ్‌ శాఖలో నూతనంగా నలుగురు ఇంజినీర్లు ఒప్పంద పద్ధతిన వచ్చారని తెలిపారు. మిగిలిన గ్రామాల్లో అర్హుల జాబితా రూపొందించాలని ఆదేశించారు. అనర్హుల వివరాలు ఉంటే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, ఇంజినీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement