
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
దహెగాం(సిర్పూర్): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండల కేంద్రంతోపాటు లగ్గాం గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వరి ధాన్యంలో తేమశాతం 17కు మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పంట విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.