ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి

May 6 2025 12:08 AM | Updated on May 6 2025 12:08 AM

ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి

ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి జేఏసీ కన్వీనర్‌ దివాకర్‌ అధ్యక్షతన సోమవా రం రౌండ్‌ టేబల్‌ సమావేశం నిర్వహించారు. ఆయ న మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చే యాలని, ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గు ర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించా లని, కొత్త అలవెన్స్‌ అమలు చేయాలని, రిటైర్డ్‌ ఉ ద్యోగులకు బకాయిలు చెల్లించాలన్నారు. మహాలక్ష్మి పథకం అమలులో జరిగే తప్పిదాలకు సిబ్బంది ని శిక్షించొద్దని, కారుణ్య నియామకాలను రెగ్యులర్‌ ప్రాతిపదికన చేపట్టాలని, ప్రస్తుతం కన్సాలిటేడెడ్‌ పే కింద పనిచేస్తున్న వారందరినీ రెగ్యులర్‌ చేయాలన్నారు. 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై న మోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. సంస్థలోని మహిళా కండక్టర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు. అనంతరం సమ్మెకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పిడుగు శంకర్‌, డిపో అఽ ద్యక్షుడు అశోక్‌, నాయకులు ఆత్మకూరి చిరంజీవి, మోహన్‌బాబు, రఘులయ్య, శ్రీనివాస్‌, ప్రేంసింగ్‌, హరికృష్ణ, శోభన్‌బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement