విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి

May 3 2025 11:23 AM | Updated on May 3 2025 11:23 AM

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించే దిశగా పట్టుదలతో ముందుకెళ్లాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం గుండి గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటిసారి ఉత్తీర్ణత సాధించిన పదో తరగతి బ్యాచ్‌ వి ద్యార్థులను శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి స న్మానించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందు కు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, నాయకులు రవీందర్‌, మల్లేశ్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement