
ఏజెంట్ల దందా..
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025
జిల్లా రవాణా శాఖ కార్యాలయం
దళారి లేకపోతే అంతే..
ప్రభుత్వం, రవాణా శాఖ ఉన్నతాధికారుల ప్రకటనలు నమ్మి ఎవరైనా వాహనదారుడు నేరుగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్తే పని పూర్తవడం కష్టమేనని చెబుతున్నారు. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ మొదలు క్యూలో నిల్చోవడం, ఆన్లైన్ పరీక్ష రాయడం వరకు ఇబ్బందులు తప్పవు. అంతేకాక నేరుగా వెళ్లే వాహనదారులు ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం లేదు. ఇవన్నీ పూర్తయినా అవసరమైన కాగితాలన్నీ లేవనో, ఇంకేదైనా సర్టిఫికెట్ తక్కువగా ఉందనో కొర్రీలు పెడుతూ రకరకాల ప్రశ్నలతో ఉద్యోగులు విసిగిస్తారని చెబుతున్నారు. అదే ఏజెంట్ల ద్వారా వెళ్లే వాహనదారుడు నిరక్షరాస్యుడైనా అవలీలగా పరీక్ష గట్టెక్కుతుండడం గమనార్హం. దీంతో 24 సేవలు ఆన్లైన్ చేసినా.. ఏజెంట్ల ద్వారానే ఎక్కువగా పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
షరా ‘మామూలే’..
ఆర్టీఓ కార్యాలాయాల్లో ఏజెంట్లు ఉండొద్దని ఉన్నతాధికారులు చెబుతున్నా ఏళ్ల తరబడి వీరి దందాకు తెర పడడం లేదు. అధికారులు వీరి ద్వారా వచ్చే పనులను త్వరగా పూర్తిచేస్తుండడం, వాహనదారుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న పలువురు కార్యాలయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆర్టీఓ కార్యాలయాల్లో పలుమార్లు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయాన ఏజెంట్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించకగా, కొన్ని రోజులపాటు అధికారులు వారిని కార్యాలయాల్లోకి అడుగు పెట్టనివ్వలేదు. ఆ తర్వాత అన్నీ ‘మామూలు’గానే మారిపోయాయి. మళ్లీ ఏజెంట్లు కార్యాలయాలకు రావడం, పనులు చేయించడం యథావిధిగా కొనసాగుతోంది.
ఏసీబీ కలకలం..
హైదరాబాద్ ఉప్పల్తోపాటు రాష్ట్రంలోని పలు ఆర్టీఓ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సమాచారం అందడంతో ఖమ్మం, వైరా, సత్తుపల్లి ఆర్టీఓ కార్యాలయాల వద్ద ఏజెంట్లు గురువారం మధ్యాహ్నం నుంచి ముఖం చాటేశారు. శుక్రవారం కూడా కొందరు ఏజెంట్లు మాత్రమే సమీపంలో తచ్చాడుతూ అప్పటికే బుక్ చేసిన స్లాట్ల ప్రకారం వాహనదారుల పనులు జరిగేలా చూశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ తమ ద్వారా వచ్చిన వాహనదారుల వివరాలు చేరవేశారు. కాగా, ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ తనిఖీలు జరుగుతాయనే ప్రచారం కలకలం రేపగా.. అధికారులు, సిబ్బంది కాసేపు హడావిడి చేశారు. అంతేకాక ఏజెంట్లను కార్యాలయంలోనికి రానివ్వకపోగా, తమ షాప్లకు ఏజెంట్లు తాళాలు వేయడం గమనార్హం.
న్యూస్రీల్
జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో వీరిదే హవా
నేరుగా వెళ్తే వాహనదారులు
వేచి ఉండాల్సిందే..
ఏజెంట్ల ద్వారా వెళ్తే సులువుగా పనులు
తాజాగా ఏసీబీ భయంతో ఆఫీస్లకు దూరంగా కొందరు
రవాణా శాఖ కార్యాలయాల్లో వాహనదారుల సేవలన్నీ ఆన్లైన్ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా... కార్యకలాపాలు మాత్రం ఏజెంట్ల
కనుసన్నల్లోనే సాగుతున్నాయి. నేరుగా వెళ్లే వాహనదారులు పనుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి రావడం... తీరా తమ వంతు వచ్చినా కొర్రీలతో అధికారులు తిరస్కరించడం పరిపాటిగా మారింది. దీంతో డబ్బులు పోయినా పని త్వరగా ముగుస్తుండడంతో వాహనదారులు
ఏజెంట్లనే ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా వీరి దందా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా వెలుగొందుతోంది. ఏళ్లుగా ఆర్టీఏ
కార్యాలయాల్లో ఏజెంట్ల వ్యవహారం వేళ్లూనుకుపోగా, అధికారుల తనిఖీ సమయాన రెండు, మూడు రోజులు దూరంగా ఉండడం.. ఆపై
షరా మామూలుగానే కార్యకలాపాలు సాగిస్తుండడం పరిపాటిగా మారింది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
అంతా వారిదే రాజ్యం..
జిల్లా కేంద్రమైన ఖమ్మంతో పాటు వైరా, సత్తుపల్లిల్లో రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 200 మంది ఏజెంట్లు ఉన్నట్లు అంచనా. వీరిలో పలువురు రవాణా శాఖ కార్యాలయాలకు సమీపాన షాప్లు ఏర్పాటుచేసుకోగా, ఇంకొందరు టీ దుకాణాలు, జిరాక్స్ సెంటర్లలో అందుబాటులో ఉంటున్నారు. వాహనదారులకు కొత్త లైసెన్స్, రెన్యువల్, రిజిస్ట్రేషన్, వాహన పన్ను, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇలా ఏది కావాలన్నా వీరిని ఆశ్రయిస్తే త్వరగా పూర్తవుతుంది. క్యూలైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా అన్ని పనులు చకచకా జరుగుతుండడంతో వాహనదారులు వీరినే ఆశ్రయిస్తున్నారు. అధికారులు కూడా దరఖాస్తులపై ‘కోడ్’ ఆధారంగా ఏజెంట్ల ద్వారా వచ్చినవైతే అభ్యంతరాలు చెప్పకుండా పూర్తిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఏజెంట్ల దందా..

ఏజెంట్ల దందా..