
●‘అమ్మ’కు ఇల్లు దక్కింది..
కల్లూరురూరల్: తల్లికి అండగా నిల వాల్సిన కుమారులు ఆమెను ఇంటి నుంచి గెంటే యగా.. ఆమె అధికా రులను ఆశ్రయించడంతో న్యాయం జరిగింది. కల్లూరు మండలం రావికంపాడుకు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలైన తేనే నాగమ్మ భర్త మృతి చెందగా రూ.2వేల పింఛన్, రేషన్ బియ్యంతో జీవనం కొనసాగిస్తోంది. ఆమె ఉంటున్న ఇంటి నుంచి కుమారులు గత నెల 28న గెంటేశారు. దీంతో నిరాశ్రయులైన నాగమ్మ ఆర్డీఓ రాజేందర్గౌడ్కు ఫిర్యాదు చేసింది. సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం ఆమె ఆరుగురు కుమారులు ప్రతీనెల సంరక్షణ, జీవన భృతి కింద రూ.వెయ్యి చెల్లించడంతో పాటు ఇంటిని అప్పగించాలని ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం తహసీల్దార్ పి.సాంబశివుడు, పోలీసులు, ఆర్ఐ సుజాత తదితరులు చెన్నూరు వెళ్లి నాగమ్మకు ఇల్లు అప్పగించడంతో ఆమె కృతజ్ఞతలు తెలిపింది.