నేడు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం పర్యటన

Jun 11 2025 9:02 AM | Updated on Jun 11 2025 9:02 AM

నేడు

నేడు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం పర్యటన

ఖమ్మంవన్‌టౌన్‌/మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30గంటలకు ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో అత్యవసర సమయాల్లో విద్యుత్‌ సిబ్బంది ఉపయోగించే విద్యుత్‌ అంబులెన్స్‌లను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు మధిరలో రూ.8.50కోట్లతో నిర్మించే బస్‌ స్టేషన్‌ పనులకు డిప్యూటీ సీఎం, మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

క్లినికల్‌ శిక్షణకు

21వరకు దరఖాస్తులు

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్మీడియట్‌ ఎంఎల్‌టీ ఒకేషనల్‌ కోర్సులో 2020 నుంచి ఇప్పటివరకు ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఏడాది పాటు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో క్లినికల్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణకు ఎంపికై న వారు రూ.వెయ్యి డీడీ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలి పారు. విద్యార్థినీ, విద్యార్థులు బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో పాటు రూ.10పోస్టల్‌ స్టాంప్‌ అతికించిన సొంత చిరునామా కవర్‌ను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో అందజేయాలని డీఐఈఓ సూచించారు.

ముమ్మరంగా

యూటీ నిర్మాణ పనులు

కూసుమంచి: మునుపెన్నడూ లేని విధంగా గత ఏడాది సెప్టెంబర్‌లో పాలేరు రిజర్వాయర్‌కు 2లక్షల క్యూసెక్కుల మేర వరద చేరగా సాగర్‌ ఎడమ కాల్వపై కూసుమంచి మండలం హట్యాతండా వద్ద ఉన్న యూటీ(అండర్‌ టన్నెల్‌) కొట్టుకుపోయింది. దీంతో పాత యూటీని తొలగించి 77 మీటర్ల పొడవుతో కొత్తది నిర్మిస్తున్నారు. ఇది భారీ వరదలు వచ్చినా తట్టుకుంటుందని అధికారులు చెబుతున్నారు. నిర్మాణ పనుల్లో 120 మంది కార్మికులు రెండు షిఫ్ట్‌లుగా పనిచేస్తున్నారు. ఇటీవల పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో వానాకాలం పంటలకు నీరు ఇచ్చేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

రేపటి నుంచి

యూడీఐడీ శిబిరాలు

ఖమ్మంవైద్యవిభాగం: దివ్యాంగుల వైకల్య శాతాన్ని నిర్ధారించి యూడీఐడీ(యూనిట్‌ డిజేబులిటీ ఐడీ) కార్డులు జారీ చేసేందుకు ఈనెల 12 నుంచి 28వరకు క్యాంపులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా దివ్యాంగులందరికీ ఖమ్మం ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం దివ్యాంగులు మీ సేవ సెంటర్లు లేదా ఫో న్‌ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని తెలిపారు. క్యాంప్‌నకు హాజరయ్యే సమయాన స్లాట్‌ రశీదు, ఆధార్‌కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్ట్‌ ఫొటో, వైద్యపరీక్ష నివేదికలో రావాలని సూచించారు. ఈ క్యాంపులు 12, 17, 19, 21, 24, 26, 28వ తేదీల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయని తెలిపారు.

కొనసాగుతున్న

సర్టిఫికెట్ల పరిశీలన

ఖమ్మం సహకారనగర్‌: బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా... మంగళవారం 485మంది అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరయ్యారు. ఈనెల 13వ తేదీ వరకు డైట్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ జరుగుతుందని ప్రిన్సిపాల్‌ సామినేని సత్యనారాయణ తెలిపారు. ఇందుకోసం ఆరు కౌంటర్ల ద్వారా 3,200మంది సర్టిఫికెట్ల పరిశీలించాల్సి ఉండగా, రోజుకు 650 మందికి అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డైట్‌ అధ్యాపకులు, ఉద్యోగులు ఎస్‌.ప్రసాద్‌, బాలమురళి, పద్మ, ఎర్రమళ్ల శ్రీనివాసరావు, అమీర్‌ఖాన్‌, నవీన్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం పర్యటన
1
1/1

నేడు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement