క్రికెట్‌ ఆడేందుకు వెళ్తూ మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ ఆడేందుకు వెళ్తూ మృత్యువాత

Jun 8 2025 12:18 AM | Updated on Jun 8 2025 12:18 AM

క్రిక

క్రికెట్‌ ఆడేందుకు వెళ్తూ మృత్యువాత

వేంసూరు: స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్‌ ఆడదామని బయలుదేరిన ఇద్దరు యువకులు మార్గమధ్యలోనే మృత్యువాత పడ్డారు. వేంసూరు మండలంలో శనివారం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. వేంసూరు మండలం భరణిపాడు గ్రామానికి చెందిన మల్లెపూల సాత్విక్‌, సూరటి జగదీష్‌, విస్సంపల్లి జస్వంత్‌ స్నేహితులు. మర్లపాడులో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడేందుకు ముగ్గురు కలిసి బైక్‌పై బయలుదేరారు. అయితే, కందుకూరు దాటాక మర్లపాడు దగ్గరలో భరణిపాడు వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్‌ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా సాత్విక్‌(22) ఘటనాస్థలిలో మృతి చెందాడు. జగదీష్‌(21)ను ఖమ్మం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అలాగే, జస్వంత్‌కు సత్తుపల్లి ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. చేతికి వచ్చిన కుమారులు మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

కోళ్ల వ్యాన్‌ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి

క్రికెట్‌ ఆడేందుకు వెళ్తూ మృత్యువాత1
1/1

క్రికెట్‌ ఆడేందుకు వెళ్తూ మృత్యువాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement