దేశం జోలికొస్తే సత్తా చూపిస్తాం | - | Sakshi
Sakshi News home page

దేశం జోలికొస్తే సత్తా చూపిస్తాం

May 26 2025 12:13 AM | Updated on May 26 2025 12:13 AM

దేశం జోలికొస్తే సత్తా చూపిస్తాం

దేశం జోలికొస్తే సత్తా చూపిస్తాం

ఖమ్మం మామిళ్లగూడెం : దేశం జోలికొస్తే నారీమణుల సత్తా చూపిస్తామని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన సందర్భంగా ఆదివారం ఖమ్మంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పహల్గాం ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులకు ప్రధాని నరేంద్రమోడీ తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ఇకపై దేశం జోలికొస్తే చావు తప్పదనేలా ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం కావడం హర్షణీయమన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు ఆర్మీ అధికారులు తగిన శాస్తి చేశారని చెప్పారు. ఇకపై దేశం జోలికి రావాలంటేనే వణికిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైరాలో సోమవారం జరిగే తిరంగా యాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జవాన్లకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్‌ సన్నే ఉదయ్‌ప్రతాప్‌, నాయకులు బండారు నరేష్‌, నకరికంటి వీరభద్రం, విజయారెడ్డి, దొడ్డా అరుణ, పమ్మి అనిత, నీరుకొండ ఉషారాణి, శ్రీరామనేని మణి, మంద సరస్వతి, రజినీరెడ్డి, సురేఖ, కనగంటి నాగమణి, దార్ల మల్లేశ్వరి, శిరీష పాల్గొన్నారు.

బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement