
మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం
కరువు తీర్చిన ‘రామదాసు’
భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా విడుదలైన నీటితో మండు వేసవిలోనూ పలు చెరువులు కళకళలాడుతున్నాయి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
● వైద్య, ఆరోగ్య శాఖకు రూ.11,482 కోట్ల నిధులు ● రఘునాథపాలెంలో మెడికల్ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపన ● పాల్గొన్న మంత్రులు దామోదర రాజనర్సింహ, తుమ్మల, పొంగులేటి
వాతావరణ ం
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం చిరుజల్లులు కురిసే అవకాశముంది. మిగతా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
10లో
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025
●ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండ్!
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో వైద్య, ఆరోగ్య రంగంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై మంత్రులు సి. దామోదర రాజ నర్సింహ, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కలెక్టరేట్లో సమీక్షించారు. తొలుత జిల్లా పరిస్థితులను కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ అవసరమైన చోట పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, బస్తీ దవాఖానాల ఏర్పాటు, కొత్త భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీలో సీట్ల సంఖ్య 100 నుంచి 150 వరకు పెంచాలని, పెద్దాస్పత్రిని 600 పడకలకు విస్తరించాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రులకు బ్రాండింగ్ కల్పించేలా హెల్ప్ డెస్క్, రిసెప్షన్, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పలు ప్రతిపాదనలు సమర్పించారు.
ఖమ్మం అర్బన్: మానవ వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ, పకడ్బందీ చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రఘునాథపాలెంలో రూ.130 కోట్లతో నిర్మించే ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన సముదాయానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి అవసరమైన భూమి, నిధులు సమకూర్చడంలో మంత్రులు కీలక పాత్ర పోషించారన్నారు. గత ప్రభుత్వం ఏటా సగటున వైద్య రంగానికి రూ.5,959 కోట్లు వెచ్చిస్తే, తాము ఒక్క ఏడాదిలోనే రూ.11,482 కోట్లు కేటాయించామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. అంతేకాక అంతర్జాతీయ ప్రమాణాలతో 58 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను రూ.11,600 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే, 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న భట్టి, మరో 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఏదేమైనా ఉద్యోగులను తాము కాపాడుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు ఏనాడు 15వ తేదీ లోపు జీతాలు ఇవ్వలేదని తెలిపారు.
వైద్య రంగానికి ప్రాధాన్యత
ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఖమ్మం మెడికల్ కళాశాలలో సీట్లు 150కి పెంచుతామని, జిల్లాలో 6–7 ప్రైమరీ హెల్త్ సెంటర్ల మంజూరుతో పాటు ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ కేటాయించనున్నామని చెప్పారు. వందనం, కొదుమూరు ప్రాంతంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అలాగే, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుతో మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాల శంకుస్థాపన ఆలస్యమైనా కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని చెప్పారు.
రైతులకు భూమి పట్టాల పంపిణీ
ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి బల్లేపల్లి వద్ద సేకరించిన భూముల్లో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి. ఈనేపథ్యాన శంకుస్థాపన సభావేదికపైనే ఆయా రైతులకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు ఎకరాకు 300గజాల చొప్పున 28మందిలో ఐదుగురికి మంత్రులు పట్టాలు అందజేశారు. మిగతా వారికి త్వరలో ఇవ్వనున్నట్లు తెలి పారు. కాగా, సీతారామలింక్ కెనాల్ నిర్మాణం పూర్తయినందున తమ వద్ద సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలని నిర్వాసితులు కోరారు. రైతు లు బి.నర్సింహారావు, జి.సురేష్, కృష్ణ, శోభన్ తది తరులు మంత్రులకు వినతిపత్రం అందజేశారు.
●పేదలకు మెరుగైన వైద్యం
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంగా వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. భట్టితో పాటు మంత్రులు సి.దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరా వు జిల్లా పెద్దాస్పత్రిని తనిఖీ చేయగా పలు విభాగాల్లో పరిశీలించి చికిత్స పొందుతున్న వారి తో మాట్లాడారు. వైద్య సేవలెలా ఉన్నాయి, మందులు ఇస్తున్నారా అని ఆరా తీశారు. అనంతరం వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, సీపీ సునీల్దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ నరేంద్ర కుమార్, టీజీఎంఐడీసీ ఎండీ ఫణీందర్రెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డీఆర్వో ఏ.పద్మశ్రీ, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, హస్తకళ ల సంస్థ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయు డు సత్యనారాయణ, మేయర్ పి.నీరజ, డీసీసీబీ చైర్మన్ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, ఆర్డీఓలు నర్సింహారావు, రాజేందర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్కుమార్, డీసీహెచ్ఎస్ రాజశేఖర్, ఆర్అండ్బీ అధికారి యాకూబ్తో పాటు ఫాతిమా జోహారా, లకావత్ సైదులు, కమర్తపు మురళి, రావూరి సైదబాబు, బాలసాని లక్ష్మీనారాయణ, మానుకొండ రాధాకిషోర్, తుళ్లూరు బ్రహ్మయ్య, సాధు రమేష్రెడ్డి, మలీదు వెంకటేశ్వర్లు, భూక్యా బాషా, తాతా రఘురాం తదితరులు పాల్గొన్నారు.
న్యూస్రీల్

మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం

మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం

మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం