
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
కల్లూరు: కల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగుబండి శరత్కుమార్(31) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుండగా భార్యాభర్తల నడుమ మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో 15 రోజుల క్రితం ఇంటికి రాగా, శరత్కుమార్ తండ్రి రమేష్ పంచాయితీ పెట్టించడంతో కోడలు కాపురానికి రానని, తనకు విడాకులు కావాలని చెప్పి వెళ్లిపోయింది. ఈమేరకు మనస్తాపానికి గురైన శరత్కుమార్ ఈనెల 27న పురుగుల మందు తాగగా, ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
షార్ట్ సర్క్యూట్తో
ఇంట్లో సామగ్రి దగ్ధం
ముదిగొండ: మండలంలోని పెద్దమండవలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఇంట్లోని సామగ్రి దగ్ధమయ్యాయి. గ్రామంలో అదనపు విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేస్తుండగా, మంగళవారం 132 కేవీ విద్యుత్ లైన్ కింద స్తంభాన్ని పైకి లేపే క్రమాన సర్వీస్ వైర్కు తాకడంతో గ్రామస్తుడైన పఠాన్ హుస్సేన్మియా ఇంట్లోకి విద్యుత్ సరఫరా అయింది. దీంతో మంటలు వచ్చి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామగ్రి, వైరింగ్ పూర్తిగా కాలిపోయింది. ఈ సమయాన హుస్సేన్ కుటుంబీకులు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకోగా, అప్పటికే స్థానికులు మంటలు ఆర్పారు. విద్యుత్శాఖ ఏడీఏ రామకృష్టారావు పరిశీలించి నష్టంపైఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, విద్యుత్ ఉద్యోగుల నిర్లక్ష్యంతోనే రూ.5లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని బాధితుడు హుస్సేన్మియా వాపోయారు.
గుండెపోటుతో ఏఎస్సై హఠాన్మరణం
మరిపెడ/గార్ల: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై హనుమంతు నాయక్ (58) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. పిల్లల చదువుల కోసం ఖమ్మం బల్లెపల్లిలో నివాసం ఉంటున్న ఆయన రోజు మాదిరిగానే మరిపెడలో విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమాన గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన గార్ల మండలం మూడుతండాలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.