నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Mar 20 2025 12:23 AM | Updated on Mar 20 2025 12:24 AM

ఖమ్మంవన్‌టౌన్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు పెనుబల్లి మండలం రామచంద్రాపురంలో ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12గంటలకు కల్లూరు మండలం పెద్దకోరుకోండిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, 12–30గంటలకు ఎర్రబోయినపల్లిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు తిరుమలాయపాలెంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక పీఏసీఎస్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే, 5గంటలకు తెట్టెలపాడు, మేడిదపల్లి, ఇస్లావత్‌ తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.

కలెక్టరేట్‌లో హౌస్‌ కీపింగ్‌కు టెండర్ల ఆహ్వానం

ఖమ్మం సహకారనగర్‌: కలెక్టరేట్‌లో పారిశుద్ధ్యం, హౌస్‌ క్లీపింగ్‌ నిర్వహణను సాయినాధ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి అప్పగించగా కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తుండడంపై ఈనెల 11న ‘సాక్షి’లో ‘కార్మికుల కష్టం కాజేస్తున్నారు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌... గత 28వ తేదీతోనే ఏజెన్సీ కాల పరిమితి ముగిసిన నేపథ్యాన పొడిగించకుండా మళ్లీ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు కలెక్టరేట్‌ పరిసరాలు, అన్ని కార్యాలయ గదులను పరిశుభ్రం చేయడం, టాయిలెట్లు, కారిడార్‌, గార్డెన్‌ నిర్వహణ కోసం ఆసక్తి ఉన్న హౌస్‌ కీపింగ్‌ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. రూ.10వేల నగదు చెల్లించి టెండర్‌ ఫారాలు తీసుకుని, ఈనెల 27న సాయంత్రం 5గంటల్లోగా టెండర్లు దాఖలు చేయాలని సూచించారు. టెండర్‌తో పాటు కలెక్టర్‌ పేరిట రూ.3,00,300 చొప్పున డీడీ లేదా చెక్కు రూపంలో అందించాల్సి ఉంటుందని, వివరాలకు 98499 06076 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

పోస్టు ద్వారా సీతారాముల కల్యాణ తలంబ్రాలు

ఖమ్మంగాంధీచౌక్‌: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వచ్చేనెల 6న శ్రీరామనవమి సందర్బంగా సీతారాముల కల్యాణం జరగనుంది. ఈమేరకు నేరుగా హాజరుకాలేని భక్తుల ఇంటికే కల్యాణ తలంబ్రాలు అందించాలని పోస్టల్‌ శాఖ నిర్ణయించింది. అంతరాలయ అర్చన, కల్యాణ తలంబ్రాల కోసం రూ.450, ముత్యాల తలంబ్రాల కోసం రూ.150ను సమీప పోస్టాఫీస్‌లో లేదా పోస్టుమ్యాన్‌కు చెల్లిస్తే కల్యాణం ముగిశాక ఇంటి వద్దకే తలంబ్రాలు చేరవేస్తామని ఖమ్మం పోస్టల్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ వి.వీరభద్రస్వామి తెలిపారు. ఈమేరకు భక్తులు ఏప్రిల్‌ 1వ తేదీ వరకు రుసుము చెల్లించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.

ఎక్కడా

ఎరువుల కొరత లేదు..

కామేపల్లి: రైతులు సాగు చేస్తున్న యాసంగి పంటలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య తెలిపారు. కామేపల్లి మండలం కామేపల్లి, కొండాయిగూడెం సొసైటీ కార్యాయాల్లో ఎరువులు, రికార్డులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో అన్ని పీఏసీ ఎస్‌ల్లో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు అధికారుల సిఫారసు మేరకే వినియోగించాలని సూచించారు. కాగా, డీలర్లు స్టాక్‌ వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలని, నానో యూరియా, నానో డీఏపీ వాడకంతో ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఏఓ తారాదేవి, ఏఈఓలు ఉష, జగదీశ్వర్‌, శ్రీకన్య పాల్గొన్నారు.

ముగిసిన ఇంటర్‌

ఫస్టియర్‌ పరీక్షలు

ఖమ్మం సహకారనగర్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు 18,165మంది విద్యార్థులకు గాను 17,515మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి కె.రవిబాబు తెలిపారు. కాగా జిల్లాలోని 40పరీక్ష కేంద్రాలను హెచ్‌పీసీ, డీఈసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేశాయని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement