
ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉద్యోగి మృతి
కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని లింగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి బుధవారం ఉదయం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన తాళ్ల శ్రీనివాసరావు(48) సిరిసిల్లలో చేనేత శాఖలో డీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలోని బంధువులను కలిసేందుకు మంగళవారం వచ్చిన ఆయన బుధవారం ఉదయం కొత్త చెరువు వద్ద బహిర్భూమికి వెళ్లిన క్రమంలో కాలుజారి పడగా మృతి చెందాడు. ఆయనకు భార్య సరిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భార్య వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
ఎన్నెస్పీ కాల్వలో పడి ఒకరు...
తల్లాడ: ప్రమాదవశాత్తు ఎన్నెస్పీ కాల్వలో పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కల్లూరు మండలం బాలాజీనగర్కు చెందిన కాళ్ల నాగేశ్వరరావు(55) కాల్వలో పడగా, మృతదేహం తల్లాడ మండలం రంగంబంజర సమీపాన తేలింది. దీంతో స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పరిశీలించిన పోలీసులు మృతదేహం నాగేశ్వర్రావుదిగా గుర్తించారు. కూలీ పనులతో జీవనం సాగించే ఆయన రెండు రోజుల క్రితం పనికి వెళ్లొచ్చాక మద్యం కోసం బయటకు వెళ్లి రాకపోవడంతో కుటుంబీకులు గాలిస్తున్నారు. ఇంతలోనే మృతదేహమై కనిపించగా ఆయన కుమారుడు శివసుబ్రమణ్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ కొండల్రావు తెలిపారు.
»êÑÌZ ç³yìl¯]l {sêMýStÆŠ‡.. {OyðlÐ]lÆŠæḥÐ]l$–†
బోనకల్: ప్రమాదవశాత్తు బావిలో ట్రాక్టర్ పడగా డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దబీరవల్లి రెవెన్యూ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వైరా మండలం పాలడుగుకు కంచపోగు మంగరాజు(28) పొలంలో పత్తి కట్టె తొలగిస్తుండగా ట్రాక్టర్ను ముందుకు, వెనకకు నడిపించే క్రమాన ఇంజిన్తో సహా బావిలో పడ్డాడు. దీంతో మంగరాజు నీట మునిగి మృతి చెందగా స్థానికులు మృతదేహాన్ని బయటకు తీయగా, ఘటనపై కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ ఆనంద్కుమార్ తెలిపారు.
ఆస్పత్రిలో గుర్తుతెలియని యాచకుడు మృతి
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రి ఆవరణలో అంబులెన్స్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తి యాచకుడు(70) బుధవారం మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఖమ్మం టూటౌన్ పోలీసులు, అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు కలిసి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు.
మోసం చేశాడని యువకుడిపై ఫిర్యాదు
ఖమ్మంఅర్బన్: ప్రేమ పేరిట నాలుగేళ్లు కలిసి ఉండి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఓ యువకుడిపై యువతి ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖమ్మం శ్రీనగర్కాలనీలో నివాసముండే ఆమె ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఇతర ప్రాంతానికి చెందిన వారిద్దరు కొద్దినెలలుగా శ్రీనగర్లో నివాసముంటున్నారని తెలిపారు.

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉద్యోగి మృతి