ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్కు అనుబంధ తెలంగాణ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్స్ అసోసియేషన్ (టీఈఎస్ఎస్ఏ) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా వి.సుమన్, కార్యదర్శిగా ఎన్. తిరుపతిరావు, కోశాధికారిగా డీ.వీ.సాయికుమార్, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాసరెడ్డి, ఎం.కిష్టయ్య, కె.మధు, సహాయ కార్యదర్శులుగా పి.మౌనిక, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.డీ.జోహెందర్ సాహెబ్, పబ్లిసిటీ సెక్రటరీగా ఎన్.స్పందన, ఈసీ మెంబర్లుగా పి.రామకృష్ణ, బి.స్వాతి ఎన్నికయ్యారు. టీఎన్జీవోస్ ప్రచార కార్యదర్శి ఎరమ్రల్ల శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా వ్యవహరించగా నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావుతో పాటు సీపీఓ ఏ.శ్రీనివాస్ అభినందించారు.