సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి ఎన్టీఆర్నగర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో సామగ్రి కాలిపోయాయి. ఎన్టీఆర్ కాలనీకి చెందిన మున్సిపాలిటీ కాంట్రాక్టు కార్మికురాలు తడికమళ్ల జయమ్మ ఇంట్లో సోమవారం షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్రిజ్, టీవీ, మంచం, రెండు బీరువాలతో పాటు కూలర్, బంరు ఆభరణాలు, నగదు కాలిపోగా, అగ్నిమాపక శాఖ సిబ్బంది వై.వెంకటేశ్వరరావు, సతీష్, బాబురావు చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే సామాగ్రి పూర్తిగా కాలిపోగా కట్టుబట్టలే మిగలడంతో బాధిత కుటుంబం రోడ్డున పడినట్లయింది. కాగా, బాధిత కుటుంబానికి మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, కాంగ్రెస్ నాయకులు ఎం.డీ.కమల్పాషా, గాదె చెన్నారావు, సందీప్గౌడ్ రూ.4వేల ఆర్థిక సాయం అందజేశారు.