ప్రజా సమస్యలపై పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై పోరాడాలి

Mar 17 2025 11:22 AM | Updated on Mar 17 2025 11:16 AM

ఖమ్మంమయూరిసెంటర్‌ : బీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని, పాలకవర్గ సమావేశాల్లో ప్రజా సమస్యలను లేవనెత్తాలని అన్నారు. ప్రతిపక్ష పాత్ర పటిష్టంగా పోషించి నగరాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్పొరేటర్లకు ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, ఎవరి బెదిరింపులకూ భయపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని విమర్శించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కర్నాటి కృష్ణ, ఎస్‌కే.మక్బూల్‌ను పువ్వాడ అభినందించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు ఆర్‌జేసీ కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్‌ విందులో..

ఖమ్మం ఖిల్లా మజీద్‌లో నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. రంజాన్‌ మాసం ఎంతో పవిత్రమైనదని, ముస్లిం మైనారిటీలు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కమర్‌, కార్పొరేటర్‌ మక్బుల్‌, షౌకత్‌ ఆలీ, నాగండ్ల కోటేశ్వరరావు, బిక్కసాని జస్వంత్‌, నజీముద్దీన్‌, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజుద్దీన్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు మాజీ మంత్రి పువ్వాడ సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement