● మొహమాటం వీడితే ఇంగ్లిష్పై పట్టు ● కలెక్టర్ ముజమ్మిల్ఖాన్
కొణిజర్ల: విద్యార్థులు మొహమాటాన్ని విడనాడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఇంగ్లిష్పై పట్టు సాధించొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మండలంలోని పెద్దమునగాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ‘ఉయ్ కెన్ లెర్న్’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులకు వివిధ కారణాలతో చదివే అవకాశం లేకున్నా పిల్లలు మంచిస్థాయికి చేరాలని చదివిస్తున్నందున వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లిష్పై పట్టు సాధించేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని, మూడునెలల్లోనే ఆశించిన మార్పు తీసుకొచ్చిన ఉపాధ్యాయుల కృషి అభినందనీయమన్నారు. అనంతరం పలువురు విద్యార్థులతో ఇంగ్లిష్లో మాట్లాడించిన కలెక్టర్ వారిని అభినందించారు. డీఈఓ ఈ సోమశేఖరశర్మ, ఏఎంఓ రవికుమార్, ఎంఈఓ అబ్రహం, ఎంపీడీఓ రోజారాణి, ఎంపీఓ రాజేశ్వరి, హెచ్ఎం కృష్ణయ్య, ఇన్చార్జ్ తహసీల్దార్ రాము పాల్గొన్నారు.
ఆయకట్టు చివరి వరకు సాగర్ జలాలు
చింతకాని: పంటలు ఎండిపోకుండా సాగర్ ఆయకట్టు చివరి భూములకు సైతం నీరందిస్తామని, రైతులు నీటిని వృథా కాకుండా వినియోగించుకోవాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. చింతకాని మండలం నాగులవంచలోని సీతంపేట ఎన్నెస్పీ మేజర్ కాల్వను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం కాలువ కట్టపై రైతులతో సమావేశమై సాగు చేసిన పంటలు, సాగునీటి లభ్యత, ధరణి సమస్యలపై ఆరాతీశారు. కొద్దిరో జుల పాటు ఆయకట్టుకు సాగర్ జలాలు అందిస్తే పంటలకు ఢోకా ఉండదని రైతులు చెప్పగా.. పర్యవేక్షించాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయితే, పత్తి, మొక్కజొన్న, పెసర, మిర్చి మాత్రమే కాక ఆయిల్పామ్పై రైతులు దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందుకోసం రైతులకు అధికా రులు అవగాహన కల్పించాలన్నారు. కాగా, మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాలని, నాగులవంచలో గ్రంథాలయం, బ్యాంక్, ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ను గ్రామస్తులు కోరారు. జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, ఏడీఏ విజయ్చంద్ర, ఇరిగేషన్ ఈఈ రామకృష్ణ, ఏఈలు మహేష్, సురేష్, సందీప్, విద్యుత్ ఏఈ ఉమామహేశ్వరి, తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, ఏఓ మానస పాల్గొన్నారు.
పంటలు ఎండకుండా సమన్వయంతో పనిచేయాలి
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో ఎక్కడ కూడా యాసంగి పంటలు ఎండిపోకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్ నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఆయన ప్రతీ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, ఏఈఓ, నీటిపారుదల శాఖ ఏఈతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలతో మండలాల వారీగా వాట్సప్ గ్రూప్లు ఏర్పాటుచేసి రైతులకు నీటి విడుదల షెడ్యూల్పై సమాచారం ఇవ్వాలని చెప్పారు. పంట చేతికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉంటూ నీరు సరఫరా చేయాలని తెలిపారు. అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఏఓ పుల్లయ్య, జల వనరుల శాఖ ఎస్ఈలు వాసంతి,
వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఆత్మవిశ్వాసమే కీలకం