వచ్చే ఏడాది అన్ని స్కూళ్లలో ఏఐ | - | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది అన్ని స్కూళ్లలో ఏఐ

Mar 14 2025 12:51 AM | Updated on Mar 14 2025 12:50 AM

నేలకొండపల్లి/ముదిగొండ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ఆధారిత బోధన ప్రారంభిస్తామని జిల్లా విద్యా శాఖాధికారి సోమశేఖరశర్మ తెలిపారు. నేలకొండపల్లిలోని సింగారెడ్డిపాలెం పాఠశాలను గురువారం సందర్శించిన ఆయన ఏఐ ఆధారితో బోధన, విద్యార్థులను సామర్‌ాధ్యలను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుతం ఏడు పాఠశాలల్లో ఈ బోధన ప్రారంభించగా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. దీంతో వచ్చే ఏడాది అన్ని పాఠశాలల్లో మొదలుపెడతామని చెప్పారు. కాగా, ఎస్సెస్సీ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 97 కేంద్రాలు ఏర్పాటుచేయగా 16,500 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. కాగా, ముదిగొండ మండలం బాణాపురం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ కాంప్లెక్స్‌ వార్షికోత్సవాన్ని గురువారం నిర్వహించగా విద్యార్థులకు టీఎల్‌ఎం మేళా, ప్రతిభాపాటవ, సాంస్కృతిక అంశాల్లో పోటీలు జరిగాయి. ఈ మేరకు స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం ఇ.వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో డీఈఓ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరిస్తూ ప్రవేశాల సంఖ్య పెంచాలన్నారు. కాగా, పోటీల్లో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎగ్జామినేషన్‌ బోర్డు అసిస్టెంట్‌ కమిషనర్‌ గోపగాని రమేష్‌, ఏఎంఓ రవికుమార్‌, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోర్డినేటర్‌ మద్దినేని పాపారావు, ఎంఈఓలు బి.చలపతిరావు, రమణయ్య, హెచ్‌ఎంలు హరి శ్రీనివాస్‌, వెంకట్రాంరెడ్డి, కె.శాంతి, ఖాధర్‌, శ్రీను, సుబ్బారావు, పద్మావతి తదతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement