వైరా: వైరాలోని కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం కిసాన్ మేళా నిర్వహించారు. ఆఽధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న మాట్లాడుతూ సంప్రదాయ విధానంలో కంటే అధిక సాంద్రత పద్ధతిలో అఽధిక దిగుబడి సాధించవచ్చని చెప్పారు. వరి సాగు పద్ధతులపై మరో ప్రధాన ఽశాస్త్రవేత్త డాక్టర్ వెంకన్న వివరించారు. వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. మేలైన వరి సాగుకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అపరాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె రుక్మిణీ దేవి మాట్లాడుతూ.. జిల్లాలో అపరాల సాగు పెరుగుదలకు కృషి చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖాధికారి మధుసూదన్, పశువైద్య శాఖ ఏడీఏ డాక్టర్ కె శ్రీరమణి, మధిర, వైరా ఏడీఏలు విజయచంద్ర, టి.కరుణశ్రీ, ప్రొఫెసర్ ఐ.వి. శ్రీనివాసరెడ్డి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్టినేటర్ డాక్టర్ కె.రవికుమార్, శాస్త్రవేత్తలు వి. చైతన్య, డాక్టర్ ఫణిశ్రీ, రైతులు రాణా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
వైరా కేవీకేలో కిసాన్ మేళా