ఖమ్మంస్పోర్ట్స్: బిహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న జాతీయస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో ఖమ్మానికి చెందిన బి.వైశాలి రజత పతకం సాధించింది. హైప్టాథ్లిన్ ఈవెంట్లో పతకం సాధించిన ఆమెను డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, కోచ్ ఎండీ గౌస్, జిల్లా అథ్లెటిక్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు నున్న రాధాకృష్ణ, అధ్యక్షులు మందుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి షఫీక్ అహ్మద్, సభ్యులు కృష్ణయ్య, సుధాకర్, శశి, రవి, వెంకటేశ్వర్లు, పవన్కుమార్, శ్రీనివాస్, హజీరా ఫాతిమా, ముజహిద్, నవీద్ తదితరులు అభినందించారు.