దేవాలయ వివాదంపై అధికారుల విచారణ | - | Sakshi
Sakshi News home page

దేవాలయ వివాదంపై అధికారుల విచారణ

Mar 13 2025 12:36 AM | Updated on Mar 13 2025 12:34 AM

నేలకొండపల్లి: మండలంలోని చెరువుమాధారం శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం వివాదం ముదురుతోంది. కొంత కాలంగా దేవాలయాన్ని నిర్వాహకులు పట్టించుకోవటం లేదని, కనీసం దీప, ధూప, నైవేద్యం కూడా పెట్టటం లేదని గ్రామస్తులు దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. కొంతకాలంగా అంకమ్మతల్లి దేవాలయం విషయంలో వివాదం తలెత్తింది. జాతర సమయంలో తప్ప, మిగతా సమయంలో దేవాలయంలో కనీసం దీప, ధూప, నైవేద్యం కూడా పెట్టటం లేదని గ్రామస్తులు దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఈ.వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ ఈఓ పి.శ్రీకాంత్‌ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 14 నుంచి జరిగే జాతర అనంతరం మరోమారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, గ్రామస్తుల అభిప్రాయాలు, ప్రస్తుత నిర్వాహకుల వివరణ తీసుకుని నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.

ఏడు నామినేషన్లు దాఖలు

ఖమ్మంసహకారనగర్‌: ఖమ్మం జిల్లా తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం ఏడు సభ్యులకు గాను మూడు రోజుల్లో ఏడుగురు నామినేన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి అవధానుల శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించి బి.శ్రీధర్‌సింగ్‌, మహిళా విభాగానికి సంబంధించి జి.మృదుల, ఉబ్బన సరిత, జనరల్‌ కేటగిరికి సంబంధించి ఏలూరి శ్రీనివాసరావు, కోల రాంబాబు, జి.బాలకృష్ణ, ఎర్రా రమేశ్‌ నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. కాగా ఎన్నికల ఫలితాలు మాత్రం హైకోర్టు ఆదేశానుసారం వెల్లడిస్తామని చెప్పారు.

ఏకగ్రీవమయ్యే అవకాశం..

హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీకి సంబంధించి ఏడుగురు సభ్యులు ఉండగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయగా.. మొత్తంగా ఏడు నామినేషన్లు మాత్రమే దాఖలు కావటంతో ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

నేటి నుంచి ఎద్దుల పోటీలు

వేంసూరు: మండలంలోని కందుకూరులోని శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం సందర్భంగా గొర్ల సత్యనారాయణరెడ్డి (బుల్లిబాబు) జ్ఞాపకార్థం గురువారం నుంచి మూడురోజులపాటు జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఒంగోలు జాతి ఎద్దులు కందుకూరు చేరుకున్నాయి. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.40 వేలు, 3వ బహుమతి రూ.30 వేలు, 4వ బహుమతి రూ.25 వేలు 5వ బహుమతి రూ.20 వేలు, 6వ బహుమతి రూ.15 వేలు, 7వ బహుమతి రూ.10 వేలు, 8వ బహుమతి రూ.7 వేలు అందించనున్నామని నిర్వాహకులు తెలిపారు.

దేవాలయ వివాదంపై అధికారుల విచారణ 1
1/1

దేవాలయ వివాదంపై అధికారుల విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement