
మాట్లాడుతున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సింగరేణి(కొత్తగూడెం): విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆకాంక్షించారు. ఆదివారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయిలో అండర్–14 విభాగంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో రాణించిన వారిని ఈ నెల 13,14, 15 తేదీల్లో మహబూబ్నగర్లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పంపిస్తారని తెలిపారు. విద్యార్థులు సత్తా చాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ బోళ్ల వెంకటేశ్వర్లు, సహాయకులుగా డాక్టర్ వీరునాయక్, కాంతారావు పాల్గొన్నారు.