
పెద్దమ్మతల్లి అమ్మవారు
జిల్లాలో సోమవారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. రాత్రి పూట చలి ప్రభావం అధికంగా ఉంటుంది.
రామయ్యకు సువర్ణపుష్పార్చన
భధ్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు స్వామి వారిని పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.
అమ్మవారికి
మొక్కుల చెల్లింపు
పాల్వంచ: మండలంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం(పెద్దమ్మగుడి) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించారు. అన్నప్రాశనలు, వాహన పూజలు నిర్వహించారు. తలనీలాలు, ఒడిబియ్యం, చీరలు, కనుములు తదితర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ ఎన్.రజినీకుమారి పూజాది కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

నిత్యకల్యాణ క్రతువును నిర్వహిస్తున్న అర్చకుడు