సింగరేణి(కొత్తగూడెం): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డిని ఆదివారం సింగరేణి డైరెక్టర్ (పా) ఎన్. బలరామ్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి గనులు, సోలార్ విద్యుత్, థర్మల్ విద్యుత్ తదితర అంశాలపై చర్చించినట్లు డైరెక్టర్ తెలిపారు. కాగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు కొత్తగూడెంలో సింగరేణి అధికారులు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్వీకే శ్రీనివాస్, డైరెక్టర్ (పిఅండ్పి) జి. వెంకటేశ్వరరెడ్డి, జీఎంలు కట్టా బసవయ్య, దీక్షితులు, సీహెచ్ శశిధర రాజు తదితరులు పాల్గొన్నారు.