ఉత్సవాలను విజయవంతం చేయండి

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌ - Sakshi

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రణాళికాయుతంగా చేపడుతూ విజ యవంతం చేయాలని కలెక్టర్‌ వీ.పీ.గౌతమ్‌ సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులు, ఇదే స్ఫూర్తితో తెలంగాణ సాధన అనంతరం సాధించిన విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 22వ తేది వరకు జరిగే అన్ని కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని తెలి పారు. కాగా, శనివారం జరిగే తెలంగాణ రైతు దినోత్సవానికి రైతు వేదికలను ముస్తాబు చేయాలని, రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా చేరుకునేలా పర్యవేక్షించాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ముందస్తు సాగు, పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాధికాగుప్తా, డీఆర్వో ఆర్‌.శిరీష, సీపీఓ శ్రీనివాస్‌, కలెక్టరేట్‌ ఏఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Read latest Khammam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top