జంతు సంరక్షణ మన ప్రాధాన్యత కావాలి | - | Sakshi
Sakshi News home page

జంతు సంరక్షణ మన ప్రాధాన్యత కావాలి

Dec 21 2025 9:35 AM | Updated on Dec 21 2025 9:35 AM

జంతు సంరక్షణ మన ప్రాధాన్యత కావాలి

జంతు సంరక్షణ మన ప్రాధాన్యత కావాలి

హొసపేటె: మన చుట్టు ఉన్న జంతువులను మన స్వంత కుటుంబ సభ్యుల మాదిరిగానే జాగ్రత్తగా చూసుకోవాలి, వాటికి ఇబ్బంది కలిగించకూడదు అని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్‌ పార్క్‌ వన్యప్రాణి జీవశాస్త్ర వేత్త, విద్యా అధికారిణి బీ.ఎల్‌.శైలశ్రీ తెలిపారు. కన్నడ సాహిత్య అధ్యయన విభాగం అల్లమ హాల్‌లో శనివారం ఆమె జంతువుల ప్రవర్తన అనే అంశంపై మాట్లాడారు. మానవుల్లో తల్లికి తన పిల్లలపై ఉన్న ప్రేమ వలె తల్లి పులి, నీటిగుర్రం వంటి జంతువులలో మనం దానిని చూడవచ్చన్నారు. అదే విధంగా జంతువుల ప్రవర్తన నుంచి నేర్చుకోవడం అనే నినాదం ప్రకారం మానవులు జంతువులను ఇబ్బంది పెట్టకపోతే అవి మనల్ని ఇబ్బంది పెట్టవని అన్నారు. నేడు కొన్ని జంతువులకు ప్రకృతిలో తినే ఆహారానికి బదులుగా మనకు లభించే ఆహారాన్ని ఇస్తున్నాం, ఇది జంతువుల ప్రవర్తనలో తేడాలను కలిగిస్తోందన్నారు. జంతువులను అడవి సంస్కృతిలో జీవించడానికి అనుమతించాలని ఆమె అన్నారు. వేదికపై మోడరేటర్‌ డాక్టర్‌ గోవింద రవిచంద్ర, విభాగాధిపతి ప్రొఫెసర్‌ వెంకటగిరి దళవాయి, పరిశోధకులు రవిచంద్ర, ఇస్మాయిల్‌ సిద్ధిక్‌, అక్షత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement