పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి

Dec 19 2025 12:37 PM | Updated on Dec 19 2025 12:37 PM

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి

హొసపేటె: జీపీల పరిధిలోని ప్రభుత్వ భూమిని గుర్తించి, గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు లేని పేద కుటుంబాలకు వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హక్కుల పోరాట సమితి డిమాండ్‌ చేసింది. తాలూకాలో భూమి లేని వారికి స్థలాలు అందించడానికి ప్రభుత్వ భూమిని గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ సైట్‌, హౌసింగ్‌ హక్కుల పోరాట కమిటీ తహసీల్దార్‌ కార్యాలయం ముందు మంగళవారం నిరసన చేపట్టారు. సమితి నాయకురాలు అక్కమహాదేవి మాట్లాడుతూ తాలూకాలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలు నివసించడానికి ఇళ్లు లేవు. గ్రామాల్లో పేదలు ఉమ్మడి కుటుంబాల్లో, అద్దె ఇళ్లలో, పరిచయస్తుల భూముల్లోని గుడిసెల్లో తలదాచుకుంటున్నారన్నారు. మరబ్బిహాళు, బెణకల్లు, వల్లభాపుర, హంపసాగర, వరదాపుర, దశమాపుర, కిత్తూరు, రామేశ్వరబండి, హంపాపట్టణ తదితర గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ భూమిని వెంటనే గుర్తించి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ ఆర్‌.కవితకు వినతిపత్రం అందించారు. సంస్థకు చెందిన సి.సుధ, రత్నమ్మ, రేఖ, నింగమ్మ, కోగళి మల్లేష్‌, అన్నపూర్ణ, మీనాక్షి, నింగమ్మ, ప్రమీలమ్మ, గంగమ్మ, రేణుకమ్మ, లక్ష్మమ్మ, సావిత్రిమ్మ, గులెదల్‌ వెంకటేష్‌, శోభ, రేణుక, చంద్రగౌడ, దొడ్డబసప్ప, నింగప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement