
హత్య కేసులో నిందితుల అరెస్ట్
హుబ్లీ: బాత్రూమ్లో జరిగిన రాజేంద్ర శ్రీనివాస్ (30) హత్య కేసును ఛేదించడంలో హొసదుర్గ పోలీసులు సఫలీకృతులయ్యారు. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా హుణనవిడులో ఓ ఇంటి బాత్రూమ్లో స్నానం చేస్తున్న రాజేంద్రను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. ఆ రక్తసిక్త ఫోటోలను ఇన్స్టాలో పోస్టు చేసి వికృతం ప్రదర్శించిన హొళల్కెరె నివాసి సాగర్, సోదరుడు అభిషేక్, బంధువులు కిరణ్కుమార్, కృష్ణమూర్తితో పాటు హత్యకు సహకరించిన సంజు కరియప్ప, యశ్వంత్తో పాటు మొత్తం 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేగాక ఆ అకృత్యానికి వాడిన స్కూటీ, ఎర్టిగా కారు, రెండు మారణాయుధాలను జప్తు చేసిన పోలీసులు కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసు గురించి జిల్లా ఎస్పీ రంజిత్ కుమార్ బండారు మీడియాతో మాట్లాడారు. హొళల్కెరెకు చెందిన కిరణతో రాజేంద్ర లివింగ్ రిలేషన్షిప్లో ఉండేవాడు. కొన్ని నెలలు గడిచాక వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు. అయినా విడిపోయాక కూడా కిరణకు రాజేంద్ర ఫోన్ చేసి వేధించేవాడు. దీంతో కిరణ సోదరుడు సాగర్, అభిషేక్ ఓ సారి ఇద్దరూ కలిసి రాజేంద్రకు ఫోన్ చేసి హెచ్చరించారు. కిరణను వాడుకొని మోసం చేశాడన్న కక్షతో పిలిపించి దారుణంగా హత్య చేశారు. హత్య చేశాక సదరు హత్య దృశ్యాలను ఇన్స్టాలో నిందితుడు సాగర్ స్టేటస్లో పెట్టుకున్నాడు. హత్యకు గురైన మృతదేహం ఫోటో షేర్ చేయడంపై కేసుకు సాక్ష్యంగా పరిగణిస్తామని ఎస్పీ తెలిపారు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్