
ఆ 495 ఎకరాలకు మినహాయింపు
దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు రూరల్లోని దేవనహళ్లి తాలూకాలో పలు గ్రామాలలో భూసేకరణను విరమిస్తున్నట్లు చెప్పింది. దేవనహళ్లి తాలూకాలోని చెన్నరాయపట్టణ, చుట్టుపక్కల గ్రామాల పరిధిలో హైటెక్ డిఫెన్స్– ఏరోస్పేస్ పార్క్ కోసం 495 ఎకరాలు భూ స్వాధీనం కోసం గతంలో రైతులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ ప్రకటించారు. మంగళవారంనాడు ఈ విషయం తెలిపారు. 2021లో ఆగస్టులో 13 గ్రామాల పరిధిలోని 1,777 ఎకరాల భూమిని డిఫెన్స్– ఏరోస్పేస్ పార్క్ నిర్మాణం కోసం స్వాధీనం చేసుకుంటామని సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. చెన్నరాయపట్టణ, మట్టబార్లు, శ్రోత్రీయ, తెల్లోహళ్లి గ్రామాల పరిధిలో 495 ఎకరాలను మినహాయించామని చెప్పారు. మిగతా గ్రామాల్లో 1,232 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. మంత్రి ప్రకటనతో ఆయా గ్రామాల్లో మళ్లీ రైతుల ఆందోళనలు జరగవచ్చని అనమానాలున్నాయి. తమ భూములకూ మినహాయింపును కోరే అవకాశముంది.
1,232 ఎకరాల్ని సేకరిస్తాం
పరిశ్రమల మంత్రి పాటిల్