
కోట్ల ఆస్తిని త్యజించి.. సన్యాస దీక్ష స్వీకరించి
● నగరంలో పారిశ్రామికవేత్త భారీ ఊరేగింపు
రాయచూరు రూరల్: కోట్లకు పడగలెత్తి యావదాస్తిని వదిలి ఓ పారిశ్రామికవేత్త సన్యాసాశ్రమం తీసుకొని దీక్షకు పూనుకున్న ఘటన కల్యాణ కర్ణాటకలోని రాయచూరులో చోటు చేసుకుంది. ఇటీవల యాదగిరిలో 26 ఏళ్ల నిఖిత అనే యువతి దీక్ష స్వీకరించి రెండు నెలలు గడవకముందే తాజాగా రాయచూరు చెందిన దిలీప్ కుమార్ దోఖా(58) కూడా భార్య లీలాబాయి, ముగ్గురు కుమార్తెలను వదిలి సన్యాస దీక్ష పొందారు. 12 ఏళ్ల పాటు అమెరికాలో మందుల ఉత్పత్తి వ్యాపారాలు చేశారు. బెంగళూరులో భారీగా ఆస్తులు సంపాందించారు. 14 ఏళ్ల ప్రాయంలోనే లౌకిక సౌఖ్య సుఖ భోగాలను వీడడానికి నిశ్చయించుకున్న తరుణంలో పెద్దలు అంగీకరించక పోవడంతో నాడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో దోఖాను పెద్ద ఎత్తున ఊరేగించారు. ఈ సందర్భంగా వర్ధమాన స్థానిక నివాసి, జైన్ సేవక సంఘ్ పరిత్యాగి డాక్టర్ శ్రుత నిధిజీ, అధ్యక్షుడు శాంతిలాల్, విశ్వ కుమార్, ప్రసన్న చంద్, నరేంద్ర, గౌతం జియా, అశోక్ కుమార్ జైన్లున్నారు.

కోట్ల ఆస్తిని త్యజించి.. సన్యాస దీక్ష స్వీకరించి