
నేత్ర చికిత్సశిబిరాలు పేదలకు వరం
సాక్షి,బళ్లారి: నేత్ర చికిత్స శిబిరాలు పేదలకు వరం అని పలువురు వక్తలు కొనియాడారు. మంగళవారం కౌల్బజార్లో కార్పొరేటర్ గోవిందరాజులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర ఛికిత్స శిబిరంలో పాల్గొని వారు మాట్లాడారు. మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గత తొమ్మిదేళ్లుగా వరుసగా ఉచిత నేత్ర చికిత్స శిబిరాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. అన్ని అవయవాల్లోకి నేత్రాలు ఎంతో ముఖ్యమన్నారు. కళ్లను కాపాడుకునేందుకు, కంటిపరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. కార్పొరేటర్ గోవిందరాజులు సొంత ఖర్చులతో ఉచిత నేత్ర పరీక్షలు, ఆపరేషన్లు చేయిస్తున్నారని కొనియాడారు. దాదాపు 600 మందికి పరీక్షలు చేయగా, వీరిలో దాదాపు 120 మందికి పైగా కంటి ఆపరేషన్లు చేయడానికి వైద్యులు సూచించడంతో స్థానిక కంటి వైద్యనిపుణులు డాక్టర్ విజయ్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించిన వారికి కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. కమ్మరచేడు కళ్యాణస్వామి, బళ్లారి ధర్మగురువు బిషప్, కార్పొరేటర్లు కే.ఎస్. అశోక్, మోత్కూరు శ్రీనివాసరెడ్డి, ఇబ్రహీంబాబు తదితరులు పాల్గొన్నారు.