
వీధి కుక్కల స్వైర విహారం
● ఐదుగురికి తీవ్ర గాయాలు
రాయచూరు రూరల్: వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో ఐదుగురు తీవ్ర గాయాల పాలైన ఘటన నగరంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అంద్రూన్ కిల్లా, బైరూన్ కిల్లా, గంగా నివాస్ వద్ద వీధి కుక్కలు పిల్లలను వెంటబడి కరిచాయి. వీధుల్లో ఆడుతున్న సమయంలో ఐదారు కుక్కలు పోట్లాడుకుంటూ వచ్చి కరవడంతో పిల్లలు మహ్మద్ అయూబ్(10), సిరాజ్ జాఫ్రి(8), ఖహరిఉన్నీసా(12), సయ్యద్ పర్వేజ్(12), కదీర్ సాబ్(14)లు గాయపడ్డారు. గాయపడ్డ పిల్లలను చికిత్స నిమిత్తం రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో స్థానికులు
తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

వీధి కుక్కల స్వైర విహారం