అక్రమ మద్యం ఏరులై పారుతున్నా పట్టదా? ● | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం ఏరులై పారుతున్నా పట్టదా? ●

May 5 2025 9:02 AM | Updated on May 5 2025 9:02 AM

అక్రమ మద్యం ఏరులై  పారుతున్నా పట్టదా? ●

అక్రమ మద్యం ఏరులై పారుతున్నా పట్టదా? ●

అధికారులపై మంత్రి జమీర్‌ అహ్మద్‌

మండిపాటు

హొసపేటె: విజయనగర జిల్లాలో పాల కంటే అక్రమ మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీనిని నియంత్రించాలని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఆడిటోరియంలో శనివారం జరిగిన త్రైమాసిక కేడీపీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడురు. అక్రమ మద్యం అమ్మకాలు, మట్కా, జూదం, ఐపీఎల్‌ బెట్టింగ్‌, అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. ఎకై ్సజ్‌, పోలీసు, రవాణా శాఖలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే కే. నేమిరాజనాయక మాట్లాడుతూ.. ఎకై ్సజ్‌ శాఖ అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. సీఎల్‌7, సీఎల్‌9 లైసెన్సులు ఉన్న బార్‌ షాపులు అక్రమంగా అమ్మకాలు చేస్తున్నాయన్నారు. ఎంపీ తుకారాం, ఎమ్మెల్యేలు గవియప్ప, లతా మల్లికార్జున డాక్టర్‌,శ్రీనివాస్‌, జిల్లాధికారి ఎంఎస్‌ దివాకర్‌, ఎస్పీ శ్రీ హరిబాబు, జిల్లా పంచాయతీ అధికారి నోయంగజాయ్‌ మొహమ్మద్‌ అక్రమ షా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం ముందు ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు.

హత్యకేసులో దోషికి జీవితఖైదు

హుబ్లీ: వ్యక్తి హత్య కేసులో దోషిగా నిర్ధారణ అయిన ధార్వాడా జిల్లా ముళముత్తల గ్రామ నివాసి పరుశురామనింగప్పకాళెకు జీవిత ఖైదు విధిస్తూ బెళగావి 10వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. యరగట్టి తాలూకా ముగళహళ గ్రామ నివాసి బసవరాజు యల్లప్ప పోక్సో కేసులో బెయిల్‌ పొందాడు. ఇతను 2023లో ముగళహళ గ్రామంలోని పొలంలో హత్య గురైయ్యాడు. ఈఘటనపై పరుశురామకాళెకు వ్యతిరేకంగా మురగోడ పోలీస్టేషన్‌లో కేసు దాఖలైంది. దర్యాప్తు చేపట్టిన సీఐ ఐఎం.మఠపతి కోర్టులో చార్జీషీట్‌లో దాఖలు చేశారు. పరుశురామనింగప్ప కాళె నేరం రుజువైన నేపథ్యంలోయావజ్జీవ శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి గురురాజ చిదోళ తీర్పు చెప్పినట్లు ప్రభుత్వం తరుపు న్యాయవాధి ఆర్‌ఏ భారవళి తెలిపారు.

ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్న రాష్ట్ర సర్కార్‌

కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషి

హుబ్లీ: రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోపం వల్లనే నిత్యావవసర ధరలు పెరిగాయని సీఎం సిద్దు, డిప్యూటీ సీఎం డీకే. శికుమార్‌లు ప్రజా ధనాన్ని దోపిడి చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాదజోషి మండిపడ్డారు. స్థానిక మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరిగి ప్రజలపై భారం పెరిగిందన్నారు. అయినా ఇది రైతులకు ఉపయోగపడుతోందని సీఎం అసత్యాలను చెబుతున్నారన్నారు. సీఎం, డిసీఎం మధ్య అంతర్గత పోరుతో రాష్ట్రం నాశనమవుతుందన్నారు. దేశ భద్రతపై ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్న సిద్ధరామయ్య గురించి పాక్‌లో సంబరాలు చేసుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని పగలు దోపిడి చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు తాము పరిశుద్ధస్తులని చెప్పుకోవడానికై హుబ్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారన్నారు. కులగణనపై మాట్లాడుతూ కాంగ్రెస్‌ 1951, 61,71, 2011లో ఎందుకు కులగణనను చేపట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పోరాటానికి కేంద్రం భయపడి కులజనగణనకు నిర్ణయించిందని ఇప్పుడేమో రాహుల్‌ గాంధీ ప్రజలకు అపద్దాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. దీన్ని ప్రశ్నించిన వారిపై సిద్ధరామయ్య సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement