
మహిళా దొంగ అరెస్టు
కోలారు: బంగారుపేట పట్టణంలో బంగారు, వెండి సొత్తును దొంగిలించిన మహిళను అరెస్టు చేసిన పోలీసులు అమె వద్ద నుంచి 4.17 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. లక్ష్మీదేవమ్మ అనే మహిళ ఇంటికి తాళం వేసి మూడు రోజుల పాటు పుట్టినింటికి వెళ్లింది. ఆ సమయంలో దొంగ రుక్కమ్మ నకిలీ తాళం చెవితో ఇంట్లోకి దూరి 43 గ్రాముల బంగారు నగలు, 1.4. కేజీల వెండి సామగ్రిని ఎత్తుకెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 రోజులలో గుర్తించి రుక్కమ్మను అరెస్టు చేసి సొత్తును సీజ్ చేశారు.