పెట్రో ధరల పెంపుపై నిరసన | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరల పెంపుపై నిరసన

Apr 12 2025 2:42 AM | Updated on Apr 12 2025 2:42 AM

పెట్రో ధరల పెంపుపై నిరసన

పెట్రో ధరల పెంపుపై నిరసన

బళ్లారిఅర్బన్‌: బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం యథేచ్ఛగా పెట్రోల్‌ ధరలపై ఎకై ్సజ్‌ సుంకాన్ని పెంచిందని, తక్షణమే దీన్ని రద్దు చేయాలని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్‌ సూచనల మేరకు యూత్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో మోకా రూపనగుడి బ్లాక్‌ అధ్యక్షుడు ఎస్‌జే కోటె ఉమేష్‌గౌడ, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర, ఫైరోజ్‌ఖాన్‌, ఫాజిల్‌, అబ్దుల్‌ బారి తదితరుల సమక్షంలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి రాయల్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు పాదయాత్ర చేపట్టి వినతిపత్రాన్ని అందజేశారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ పెట్రోల్‌ ధరను రూ.2, ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచిన కేంద్ర తీరును యూత్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో పాటు ఆర్థికమాంద్యం, నిరుద్యోగంతో సామాన్యులు, రైతులు, కూలీ కార్మికులు, మధ్య, పేద తరగతి కుటుంబాలు మోయలేని భారంగా మారిందన్నారు. తక్షణమే పెంచిన ధరలను రద్దు చేసి పాత ధరలకే పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు సిద్దు హళ్లెగౌడ, సునీత, సమీర్‌, కవిత, బసవరాజ్‌, అసుండి హనుమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement