రూ.10 వేలకు నకిలీ మార్కుల జాబితా | - | Sakshi
Sakshi News home page

రూ.10 వేలకు నకిలీ మార్కుల జాబితా

Mar 26 2025 12:47 AM | Updated on Mar 26 2025 12:42 AM

బనశంకరి: క్లాసులకు వెళ్లాల్సిన పని లేదు. చదువుకోవడం, పరీక్షాలు రాయడం అవసరమే లేదు. కొంచెం డబ్బు ఇస్తే చాలు సర్టిఫికెట్‌ లభిస్తుంది. నకిలీ ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీ మార్కుల జాబితాలను అమ్ముతున్న ముఠాను సీసీబీ పోలీసులు పట్టుకున్నారు. ధారవాడవాసి ప్రశాంత్‌, బనశంకరివాసి మోనీశ్‌, గదగవాసి రాజశేఖర బళ్లారి అనే ముగ్గురు పట్టుబడ్డారని బెంగళూరు పోలీస్‌కమిషనర్‌ బీ దయానంద్‌ తెలిపారు. మంగళవారం వివరాలను వెల్లడించారు. నిందితులు కర్ణాటక రాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యా మండలి అనే పేరుతో మార్కుల జాబితాలను తయారు చేసేవారు. రూ.5 వేల నుంచి రూ.10 వేలు డబ్బు తీసుకుని టెన్త్‌, పీయూసీ సర్టిఫికెట్లను అమ్మేసేవారు. 350 మందికి పైగా నకిలీ మార్కుల జాబితాలను విక్రయించారు.

విచారణలో గుట్టురట్టు

వాటిని కొన్నవారు పలు ఉద్యోగాలు, సేవల కోసం ప్రభుత్వ శాఖలకు దరఖాస్తులు చేశారు. ఈ సర్టిఫికెట్లు అసలైనవా, కాదా అనేది పరిశీలించాలని రవాణాశాఖ, పాస్‌పోర్టుశాఖ, శిశుసంక్షేమ శాఖల నుంచి విజ్ఞప్తులు రావడంతో విచారణ చేపట్టామని చెప్పారు. పలువురు నకిలీ సర్టిఫికెట్లు అని గుర్తించి పోలీసులకు కూడా ఫిర్యాదులు చేశారు. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టగా ఈ నెట్‌వర్క్‌ బయటపడిందని తెలిపారు. బెళగావికి చెందిన మరో నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

350 మందికి పైగా విక్రయం

నగరంలో ముఠా అరెస్టు

రూ.10 వేలకు నకిలీ మార్కుల జాబితా 1
1/1

రూ.10 వేలకు నకిలీ మార్కుల జాబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement