
స్కూటర్పై వెళ్లిపోతున్న నిందితులు
ఆమె స్నేహితులు నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు.
దొడ్డబళ్లాపురం: బెంగళూరు శివార్లలో బన్నేరుఘట్ట సమీపంలోని కగ్గలీపుర పోలీస్స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారం జరగగా తీవ్ర రక్త స్రావంతో మృతిచెందింది. ప్రథమ పీయూసీ చదువుతున్న బాలిక (17)ను ఆమె స్నేహితులు నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా మొబైల్లో ఫొటోలు తీసుకున్నారు. ఫోటోలను బట్టి ముగ్గురు నిందితులు ఉన్నారని పోలీసులు తేల్చారు. వారు స్కూటర్లో వచ్చారు.
కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు
శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్కు ఫోన్ చేసి విచారించగా మధ్యాహ్నం ఒంటిగంటకే వెళ్లిపోయినట్టు తెలిపారు. అదే సమయంలో నిందితుడు వెంకటేశ్ బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి నాతో భైరసంద్రకు వచ్చింది.అయితే ఆమె స్పృహతప్పి పడిపోయిందని, ఊపిరి ఆడడం లేదని చెప్పాడు. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు వెంకటేశ్ గతంలో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినందున బాలిక తల్లిదండ్రులు అతన్ని దండించారు. ఇంతలోనే హత్యాచారం చోటుచేసుకుంది. నిందితుడు వెంకటేశ్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.