అభివృద్ధి పనులకు భూమిపూజ

పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణస్వామి తదితరులు  - Sakshi

కేజీఎఫ్‌ : తాలూకాలోని హుత్తూరు ఫిర్కాలోని వివిధ గ్రామాలలో రూ.4.55 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం బంగారుపేట ఎమ్మెల్యే ఎస్‌ఎన్‌ నారాయణస్వామి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అబ్బణి నాగరాజ్‌, బంగారుపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సీసంద్ర గోపాలగౌడ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి యూనిఫాం వితరణ

కోలారు : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దాతల సహకారం అందితే వారు మరింత విద్యాభివృద్ధి సాధనకు దోహదపడుతుందని కర్ణాటక బ్యాంకు మేనేజర్‌ జి.ఆనంద్‌బాబు తెలిపారు. నగరంలోని కోగిలహళ్లికి చెందిన పీఎం సుబ్రమణి అనే వ్యక్తి మంగళవారం తాలూకాలోని అరాభికొత్తనూరు ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థినిని దత్తత తీసుకుని ఉగాది సందర్భంగా విద్యార్థినికి 3 జతల కొత్త బట్టలను అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీఎన్‌ ప్రదీప్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top