
దేశ నలుమూలల నుంచి హాజరు
దేశ నలుమూలల నుంచి వేదపండితులు, వేద విద్యార్థులు వేములవాడ రాజన్న క్షేత్రంలో జరిగే ఈ స్మార్త పరీక్షలకు హాజరుకావడం విశేషం. ఇందుకు ముందుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్, ఎమ్మెల్యే, ఆలయ ఈవోలకు అభినందనలు. చాలా మంది హాజరు కావడం గొప్ప విషయం.
– తారకరామ కుమారశర్మ,
తిరుమల తిరుపతి వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు, యజుర్వేద విభాగం ఇన్చార్జి
సంతోషంగా ఉంది
ఈ స్మార్త పరీక్షలు వేద గ్రంథాల అధ్యయనం, ధర్మశాస్త్ర అంశాలపై ప్రావీణ్యాన్ని అంచనా వేస్తున్నాయి. అభ్యర్థులూ, పరీక్షకులూ సంప్రదాయ దుస్తుల్లో పరీక్షలలో పాల్గొనడం విశేషం. వేద విద్యార్ధులకు ఇది ఎంతో ప్రాముఖ్యత గల అవకాశం. వీరందరికీ ఆలయం ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించాం.
– రాధాభాయి, ఆలయ ఈవో

దేశ నలుమూలల నుంచి హాజరు