నన్ను క్షమించండి.. నాదే తప్పు!
● నా చావుకు ఎవరూ బాధ్యులు కారు ● వేములవాడలో వివాహిత ఆత్మహత్య
వేములవాడ: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నన్ను క్షమించండి.. నాదే తప్పు.. ఏమండీ మీరు నన్ను క్షమించండి.. మీ అమ్మడు మంజు’ అంటూ ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన వేములవాడలో చర్చనీయాంశమైంది. స్థానికుల తెలిపిన వివరాలు.. పట్టణంలోని గాంధీనగర్లో గంప మంజుల (58) అనే వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త ప్రసాద్, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులకు వివాహాలు జరిగాయి. వృత్తిరీత్యా ఒకరు కరీంనగర్, మరొకరు హైదరాబాదులో ఉంటుండగా ప్రసాద్– మంజుల దంపతులు మాత్రమే వేములవాడలో ఉంటున్నారు. అయితే తన చావుకు ఎవరూ బాధ్యులు కారు, తప్పంతా నాదే, ఏమండీ నన్ను క్షమించండి అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. మంగళవారం పోలీసుల శవపంచనామ అనంతరం పోస్టుమార్టం నిర్వహించి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
నన్ను క్షమించండి.. నాదే తప్పు!


