
లెక్క తప్పిందా!
● ఓట్లలో కుదరని పొంతన
● అన్ని డివిజన్లలోనూ అదే పరిస్థితి
● పునర్విభజన అభ్యంతరాలు 234
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ డివిజన్ల డీలిమిటేషనన్కు ప్రామాణికంగా తీసుకున్న ఇంటినంబర్లు, ఓట్ల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. 66 డివిజన్లను పునర్విభజించి, ఆ డివిజన్లో ఉన్న ఇళ్లు, ఓట్ల సంఖ్యతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను జారీ చేశారు. ఆయా డివిజన్ల వారీగా నగరపాలకసంస్థ పేర్కొన్న ఓట్లకు, వాస్తవ ఓట్ల సంఖ్యకు తేడా కనిపిస్తుండగా, మొత్తం 66 డివిజన్లలోనూ అదే పరిస్థితి నెలకొనడం కలకలం రేపుతోంది.
ఇంటినంబర్లతోనే పునర్విభజన
ఇంటినంబర్ల వారీగా డివిజన్లను విభజించడమే ప్రస్తుతం సమస్యగా మారింది. నగరంలోని మెజార్టీ ప్రాంతాల్లో ఇంటి నంబర్లు వరుస క్రమంలో ఉండకపోగా, పక్కపక్కనే వేర్వేరు సిరీస్లు ఉన్న డివిజన్లు ఎన్నో ఉన్నాయి. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఇంటి నంబర్లవారీగా డివిజన్ల హద్దులు నిర్ణయించడంతో శాసీ్త్రయత లోపించిందనే ఆరోపణలున్నాయి. 66 డివిజన్లలో ఇంటినంబర్ల వారీగా ఓట్ల సంఖ్యను నిర్ణయించారు. ఆ ఓట్ల సంఖ్యకు జనవరి 6వ తేదీన పబ్లిష్ చేసిన ఓటర్ల జాబితాలో ఆయా ఇంటి నంబర్లవారీగా ఉన్న ఓట్ల సంఖ్యకు పొంతన కుదరడం లేదు.
సరిచేసేదెలా?
డీలిమిటేషన్ అభ్యంతరాలను పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. 66 డివిజన్లలోనూ ఇంటినంబర్ల వారీగా తీసుకొన్న ఓట్ల సంఖ్య తప్పుగా ఉందని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఏ ఒక్క డివిజనోకాకుండా 66 డివిజన్లలోనూ రీ వెరిఫికేషన్ చేస్తేనే సమస్య పరిష్కారమవుతాయంటున్నాయి. అభ్యంతరాలు రాకున్నా, అన్ని డివిజన్లను శాసీ్త్రయంగా మళ్లీ పునర్విభజించాలని డిమాండ్ చేస్తున్నాయి.
పునర్విభజన అభ్యంతరాలు 234
డివిజన్ల పునర్విభజనపై నగరవ్యాప్తంగా 234 అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 5వ తేదీ నుంచి అభ్యంతరాలు స్వీకరించగా, బుధవారంతో గడువు ముగిసింది. చివరిరోజు కావడంతో బుధవారం అత్యధికంగా 95 అభ్యంతరాలు వచ్చాయి. వారం రోజులో మొత్తంగా పునర్విభజనకు సంబంధించి 234 సవరణ ప్రతిపాదనలు అధికారులకు అందాయి.
డివిజన్ల డీలిమిటేషన్పై వచ్చిన అభ్యంతరాలు
5వ తేదీ 16
6వ తేదీ 32
7వ తేదీ 04
8వ తేదీ 04
9వ తేదీ 44
10వ తేదీ 39
11వ తేదీ 95
మొత్తం 234
ప్రలోభాలకు లొంగొద్దు
డివిజన్ల పునర్విభజనలో ప్రలోభాలకు లొంగొద్దని, ఎవరైనా పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ అధికారులను హెచ్చరించారు. నిజాయితీతో, నిబద్ధతతో పునర్విభజన పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో డివిజన్ల పునర్విభజన, వీధిదీపాల నిర్వహణ, అసెస్మెంట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పూర్తి పారదర్శకంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. పాత బిల్ కలెక్టర్ల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించిన తరువాతనే నిబంధనల ప్రకారం అభ్యంతరా లు పరిష్కరించాలన్నారు. బొమ్మకల్, చింతకుంటలో కొనసాగుతున్న రెవెన్యూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 800 లైట్లను కొత్తగా కొనుగోలు చేయడం జరిగిందని, లైట్లులేనిచోట వాటిని ఇన్స్టాల్ చేయాలన్నారు. ఈఈ యాదగిరి, ఏసీపీలు బషీర్, శ్రీధర్, వేణు, టీపీఎస్లు రాజ్కుమార్, సంధ్య, తేజస్విని, ఆర్వో భూమానందం పాల్గొన్నారు.

లెక్క తప్పిందా!