7 నుంచి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

7 నుంచి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు

May 5 2025 8:48 AM | Updated on May 5 2025 8:48 AM

7 నుం

7 నుంచి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు

● కరీంనగర్‌, గోదావరిఖని, వేములవాడ, జగిత్యాలలో నిర్వహణకు కేడీసీఏ రెడీ ● ఈ నెల 6 లోపు దరఖాస్తు చేసుకున్నవారికే అవకాశం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: క్రికెట్‌లో ఓనమాలు నేర్పించేందుకు హెచ్‌సీఏ, కేడీసీఏ శ్రీకారం చుట్టాయి. గతంలో మూడు జిల్లాల్లోనే శిబిరాలు నిర్వహించగా, ఈ ఏడాది నుంచి జగిత్యాలలో శిబిరాన్ని ప్రారంభించనున్నారు. నిష్ణాతులైన కోచ్‌ల సమక్షంలో శిక్షణ ఇవ్వనున్నట్లు క్రికెట్‌ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్‌.మురళీధర్‌రావు తెలిపారు. ఈనెల 7 నుంచి జూన్‌ 6 వరకు శిబిరాలు నిర్వహిస్తారు. ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని క్రికెట్‌ సంఘం బాధ్యులు తెలిపారు.

13 నుంచి 23 ఏళ్ల వారికి..

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు అనుబంధమైన కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తారు. 13 నుంచి 23 ఏళ్ల బాలబాలికలు, పురుషులకు, మహిళలకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు.

దరఖాస్తు ఇలా..

క్రీడాకారులు ఫొటో, ఆధార్‌కార్డుతో సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కరీంనగర్‌ వావిలాలపల్లిలోని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. శిబిరానికి ఎంపికై న క్రీడాకారులు వైట్‌ యూనిఫాంతో రావాలి. మిగిలిన కిట్‌ శిబిరంలో ఇస్తారు. ఒక్కో శిబిరంలో 100 నుంచి 120 మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం దక్కుతుంది.

రాణించినవారు హెచ్‌సీఏ టోర్నమెంట్‌లో..

శిక్షణ శిబిరాల్లో రాణించిన క్రీడాకారులకు మంచి అవకాశాలు దక్కనున్నాయి. శిబిరం అనంతరం జూన్‌లో ఉమ్మడి జిల్లా క్రికెట్‌ టీంలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అండర్‌– 14,16,19,23 విభాగాల్లో జట్లను ఎంపిక చేసి హెచ్‌సీఏ (హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం) ఆధ్వర్యంలో జరుగనున్న టోర్నమెంట్‌లకు పై జట్లను పంపించనున్నారు.

కరీంనగర్‌లోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల ఎదురుగా ఉన్న క్రికెట్‌ అసోసియేషన్‌ మైదానం, సెయింట్‌ అల్ఫోన్స్‌ పాఠశాల మైదానంలో శిబిరాలు జరుగుతాయి.

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌

86887 68775 (శ్రావణ్‌కుమార్‌)

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలోని జీఎం గ్రౌండ్‌లో శిక్షణ శిబిరం జరగనుంది.

సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్‌

98663 51620 (కిరణ్‌కుమార్‌)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 2వ బైపాస్‌లో గల స్వర్గీయ నర్సింగరావు మైదానంలో శిబిరం జరుగనుంది.

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్‌

91772 59935 (రాజు)

జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీస్టేడియం లేదా ఎస్కేఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో తొలిసారిగా శిక్షణ శిబిరం జరుగనుంది.

సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్‌

99480 64712 (జలపతి)

క్రికెటర్లుగా ఎదిగేందుకు అవకాశం

క్రికెట్‌ అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. చాలా మంది పిల్లలు మైదానాలు, గల్లీలో క్రికెట్‌ ఆడుతంటారు. వీరందరు క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించే శిబిరాల్లో పాల్గొనాలి. అత్యాధునిక పద్ధతుల్లో కోచ్లు ట్రైనింగ్‌ ఇస్తారు. క్రికెటర్లుగా ఎదగాలనుకునే చిన్నారులు శిబిరాల్లో శిక్షణ తీసుకుంటే చాలా బాగుంటుంది.

– వి.ఆగంరావు, క్రికెట్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు

7 నుంచి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు1
1/1

7 నుంచి క్రికెట్‌ శిక్షణ శిబిరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement