
చందుర్తిలో మూడిళ్లలో చోరీ
చందుర్తి(వేములవాడ): చందుర్తి పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోని మూడిళ్లలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. మండల కేంద్రంలోని రెండిళ్లలో చొరబడ్డ దొంగలు వస్తువులను చిందరవందరగా పడేశారు. సిర్రం రాజవ్వ ఇంట్లో రూ.15వేలు, వెంగళి వినోద ఇంట్లో రూ.25వేలు ఎత్తుకెళ్లారు. చర్చి పాస్టర్ ప్రశాంత్ ఇంటిలోకి ప్రవేశించి ఆరుబయట నిలిపిన బైక్ను ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య దొంగతనం జరిగిన ఇళ్లలోని కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా వేలిముద్రల ఆధారంగా దొంగలు పట్టుకునేందుకు క్లూస్టీమ్తో ఆధారాలను సేకరించారు. మండలకేంద్రంలోని సీసీ పుటేజీలను సేకరించి దర్యాప్తు మమ్మురం చేస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై అంజయ్య తెలిపారు.
ఠాణాకు కూతవేటు దూరంలో దొంగతనాలు