
● ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కొత్తపల్లి(కరీంనగర్):సాగునీరందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తంచేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం మల్కాపూర్, బద్ధిపల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, ఎస్సారెస్పీ నీటితో చెరువులు, కుంటలు నింపి సాగునీటితో పాటు భూగర్భ జలాలు పెరిగాయని.. తద్వరా తాగునీటి సమ స్య తలెత్తేది కాదన్నారు. కరీంనగర్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చకముందే తగిన ఏర్పా ట్లు చేయాలని, లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఉపాధి కోల్పోయామని కూలీలు..రైతుబంధు రాలేదని రైతులు.. సబ్సిడీ గ్యాస్ అందడం లేదని, తులం బంగారం ఇవ్వడం లేదని మహిళలు.. కౌలురైతులకు రైతు భరోసా ఇవ్వటం లేదని పలువురు ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నగర, మండలశాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత, మాజీ వైస్ ఎంపీపీ బి.తిరుపతినాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, జడ్పీ మాజీ కోఆప్షన్ సాబీర్ పాషా, రైతు సంఘం అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.