నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఉగాది ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గోపాల్పేటలో ఈ నెల 19 నుంచి మూడు రోజులపాటు జరుగనున్న ఉగా ది ఉత్సవాల నిర్వహణపై స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉ త్సవాలలో భాగంగా చేపట్టనున్న ఎడ్లబండ్ల ప్రదర్శనలో ఎలాంటి అల్లర్లు జరగకుండా సర్పంచ్లు, ఉ పసర్పంచ్లు, గ్రామపెద్దలు బాధ్యత వహించాలన్నారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్, సర్పంచులు పాల్గొన్నారు.
దోమకొండ: ఉగాది పండుగ సందర్భంగా నిర్వ హించే ఎడ్లబండ్ల ప్రదర్శన శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్సై ప్రభాకర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో స ర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తిర్మల్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరె డ్డి, నాయకులు శంకర్రెడ్డి, సీతారాం మధు, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్రెడ్డి తదితరులున్నారు.


